Chiranjeevi : చిరంజీవితో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ ?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారిలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని… చాలామంది ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే రీ ఎంట్రీ తర్వాత సక్సెస్ కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాతో కంగు తిన్న చిరంజీవి, గత సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు డిఫరెంట్ జానర్ సినిమా కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వశిష్టతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ. 200 కోట్ల పైగా ఖర్చు చేయనున్నారని సమాచారం. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేశారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ ఇప్పటివరకు ఫిక్స్ కాలేదు. మొన్నటి వరకు నయనతారా ను హీరోయిన్ గా ఫిక్స్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తోంది. చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ను రంగంలోకి దింపేందుకు చిత్ర బృందం రెడీ అయిందట. ఈ మేరకు దీపికతో చిత్ర బృందం చర్చలు కూడా చేసిందట. దానికి దీపిక పదుకునే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

కాగా, ఈ సినిమాలో దాదాపు ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వస్తుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో హీరోయిన్ ను తీసుకుంటే ప్రమోషన్ పరంగా హెల్ప్ అవుతుందని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే బాలీవుడ్ నటి దీపికా పదుకుణెను మూవీ టీం సంప్రదించినట్టు సమాచారం. అయితే దీపికా.. హీరోయిన్ గా కాకుండా గెస్ట్ రోల్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు