Tollywood : సురేఖ వాణి శిరోముండనం.. అసలు కారణం ఇదే..!

ప్రముఖ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కూతురు సుప్రీతా తో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంకా కాదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తల్లి కూతుర్లు ఇద్దరు చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా సురేఖవాణి శిరోముండనం చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయగా వీటిని చూసిన నెటిజన్స్ విపరీతంగా విమర్శిస్తున్నారు. అంతేకాదు అసలు కారణం అదేనా అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరి అసలు కారణం ఏమిటి? దీనిపై సురేఖ వాణి ఏ విధంగా స్పందించింది?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు దక్కించుకున్న సురేఖ వాణి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. సురేఖవాణి తిరుమల దేవస్థానానికి వెళ్లి శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించుకుంది. అయితే ఆ పని దైవకార్యం కోసం చేసిందా? లేక మరేదైనా కారణం ఉందా? అని నెటిజనులు గుసగుసలాడుతున్నారు. తిరుమలలో కొండపై గుండు చేయించుకున్న తర్వాత కూతురు సుప్రీతా తో కలిసి సురేఖ వాణి అభిమానులతో ఫోటోలు దిగింది. రీసెంట్గా తన ఇంటికి చేరుకున్న తర్వాత గుండుతో షర్ట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇది చూసిన కొంతమంది క్యాన్సర్ వచ్చిందా?అందుకే ఈ అవతారం అంటూ కామెంట్ పోస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది రాకేష్ మాస్టర్ లా ఉన్నామని ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది మీకు ఇష్టమైన వ్యక్తుల కోసమే మీ జుట్టును త్యాగం చేశారు కదా అని కామెంట్లు పోస్ట్ చేశారు. మరి కొంతమంది భర్త చనిపోతేనే .. తల్లి కూతురు టూర్లు తిరిగారు. వీళ్ళా త్యాగం చేసేది అంటూ ట్రోల్స్ చేశాడు. ఇలా అందరూ రకరకాలుగా కామెంట్లు చేస్తుండడంతో.. మరికొంతమంది మొక్కు తీర్చుకోవడానికి సురేఖ వాణి ఇలా గుండు కొట్టించుకుంది అని చెబుతున్నారు. కొంతమంది మాత్రం సురేఖ వాణి కి క్యాన్సర్ వచ్చింది. అందుకే గుండు గీయించుకుంది లేకపోతే ఈమె ఎందుకు గుండు గీయించుకుంటుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు